శని లోక వర్ణన.

యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం .
అంగారకునిది యెర్రని శరీరం .
అతడు భూమి కుమారుడు.
అందుకే కుజుడు అనే పేరు .
దాక్షాయణీ వియోగంతో శివుడు ఘోర తపస్సు చేశాడు .
ఆయన ఫాల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది .
దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు .
అందుకే అతని తల్లిగా భూదేవిని చెపుతారు .
ఆమె పోషణలో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్రపురిలో ఉగ్రంగా తపస్సు చేశాడు .
అక్కడి నుండి కాశి చేరి లింగస్థాపన చేసి మహా తపస్సు చేశాడు .
ఇది పంచ ముద్రా స్థానంలో కంబలాశ్వతరువుకు ఉత్తరంగా ఉంది .
అందుకే అంగారకుడనే పేరొచ్చింది .
శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు .
అంగారకేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగి పోతుంది .
అంగారక చతుర్ధినాడు గణనాధుడు జన్మించాడు

అక్కడ నుండి గురులోకం చేరాడు శివశర్మ .
పూర్వం బ్రహ్మ మూడు లోకాలను సృష్టించాలని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయనతో సమానమైన ఏడుగురు పుత్రులకు జన్మ నిచ్చాడు .
వారే అంగిరసుడు ,మరీచి మొదలగు వారు .
వీరంతా సృష్టి చేసే సమర్ధులు .
అన్గిరసుడు బుద్ధికి దేవతల వంటి వాడు .
శాంతుడు జితక్రోధి ,మెత్తని వాక్కు కలవాడు
వేదార్ధవేది .రూప శీలగుణ సంపన్నుడు .
కాశీలో శాంభవ లింగాన్ని స్థాపించి శివుని అర్చించారు .
ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది .
దానికి నమస్కరించి స్తుతి చేశాడు .
దానికి సంతృప్తి పడి ’నీస్తోత్రం చాలా ఉదాత్తంగా ఉన్నది
నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు .
బుద్ధికి నీ వంటి వాడు ఉండడు .’’అని చెప్పాడు బ్రహ్మతో అతడిని వాచస్పతిని చేయమని ,
దేవాచార్య పదవి నివ్వమని చెప్పగా అలానే చేశాడు అతనిచే స్థాపింప బడిన లింగం బృహస్పతీశ్వర లింగంగా లోకం ప్రసిద్ధమైంది .
ఈ లింగాన్ని అర్చించితే పంచ మహా పాతకాలు నశిస్తాయి .

అక్కడి నుండి విష్ణుదూతలు శివశర్మను శనిలోకం చూపించారు .
మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు అతని భార్య త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞా దేవి . సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీన మయింది
సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది .
సూర్య తేజస్సును భరిస్తోంది
సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు .
వైవశ్వతుడు మొదటి వాడు .
యముడు రెండోకొడుకు .
యమునా నది కన్యకా .
ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది .
ఛాయ తో ఆమె’’నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను .
నువ్విక్కడ సుఖంగా ఉండు .
నా కూతురు యమునను జాగ్రత్తగా పోషించు ‘’
అని అప్పగించి వెళ్లి పోయింది

త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు .
భర్త దగ్గరకే పొమ్మన్నాడు .
మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక
ఒక అరణ్యం చేరి బడబ అనే ఆడ గుర్రంగా మారి తపస్సు చేస్తూ ఉంది .
ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రునిగా కన్నది .
యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది .
శని జాతి వైరాన్ని పూనాడు .
సంజ్ఞా రూపం లో ఉన్న చాయను శని శపించాడు
తన్నటానికి కాలు పైకెత్తాడు
ఆ కాలు పడిపోవు గాక అని ఆమె శపించినది .
భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది .
ఆమెకు బుద్ధి చెప్పాడు .
సంతానాన్ని సమాన ప్రేమతో చూడాలని హితవు చెప్పాడు .
శని తనను క్షమించమని తండ్రిని కోరుకొన్నాడు .
కానీ తల్లి శాపానికి తిరుగులేదని పురుగులు
అతని మాంసాన్ని తింటాయని భూలోకంలో పడటం తప్పదని చెప్పాడు .
మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయ మిచ్చాడు ..
తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడబ గా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషంలో చేరి ఆమెతో సుఖించాడు .
ఆమె పరపురుషుడేమోనని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి పంపింది .
ఆ శుక్రము నుంచి అశ్వినీ దేవతలు సూర్యతేజంతో జన్మించారు .
సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి .
శని సూర్యుని అనుమతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది గ్రహాది పత్యాన్ని పొందాడు .
పోయిన కాలు వచ్చేసింది అందుకే శని మార్గంలో వక్రత ఉంటుంది .
శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరంగా ఉంది .
దీన్ని అర్చిస్తే ఉత్తమలోక ప్రాప్తి,
గ్రహ పీడా నివారణా జరుగు తాయి .
ఓం నమః శివాయ..!!:
మిగిలిన వివరాలు..తరువాయి భాగంలో..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!: