క్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్స

దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడు.

వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టం అని చెప్పేవారు వైద్యులు.

గణేశ అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు.

మహాస్వామి వారు అతనితో "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. తిరుతురైపూంది సమీపములో తిరునెల్లిక్కావల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషనులో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది. ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పేరు "కనకల్" (తమిళంలో). ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే కాన్సర్ నయం అవుతుంది” అని చెప్పారు.

పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు. ఆశ్చర్యముగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి, కేవలం కొద్ది రోజులలలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది.

ఎప్పుడూ స్వామి వారిని ధ్యానించే ఆవిడ 80 సంవత్సరాలు పైగా జీవించారు. అంతే కాకుండా మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।