రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము
6 వ స్వాతి మనొభీష్ట పూజ
పూజ ప్రారంభము
ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము
ప్రార్థన
శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే
(తెల్లని వస్త్రములతో అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)
శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
(ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)
శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||
సంకల్పం
(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)
ధ్యానము
(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)
శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి
(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి
ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్య సింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్ర సింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్తంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||
ఓం శ్రీమతే నమః
ఓం యోగానందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం విజయాయ నమః
ఓం జయవర్ణనాయ నమః
ఓం పంచాననాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 20 ||
ఓం అఘోరాయ నమః
ఓం ఘోర విక్రమాయ నమః
ఓం జ్వలన్ముఖాయ నమః
ఓం మహా జ్వాలాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం మహా ప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః || 30 ||
ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం చండకోపినే నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః
ఓం దైత్యదానవ భంజనాయ నమః
ఓం గుణభద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం బలభద్రకాయ నమః
ఓం సుభద్రకాయ నమః || 40 ||
ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్త్రే నమః
ఓం సర్వర్త్రకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడంబరాయ నమః || 50 ||
ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం కవయే నమః
ఓం మాధవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అధ్భుతాయ నమః ll 60 ll
ఓం భవ్యాయ నమః
ఓం శ్రీవిష్ణవే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అనఘాస్త్రాయ నమః
ఓం నఖాస్త్రాయ నమః
ఓం సూర్య జ్యోతిషే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II
ఓం వజ్రదంష్ట్రయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానందాయ నమః
ఓం పరంతపాయ నమః
ఓం సర్వమంత్రైక రూపాయ నమః
ఓం సర్వమంత్ర విధారణాయ నమ:
ఓం సర్వతంత్రాత్మకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సువ్యక్తాయ నమః
ఓం భక్ర వత్సలాయ నమ: II80II
ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం ఉదార కీర్తయే నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం మహాత్మనే నమ:
ఓం దండ విక్రమాయ నమః
ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||
ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభ్రుతే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరజ్యోతిషే నమః
ఓం నిర్గుణాయ నమః || 100 ||
ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరంధామ్నే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమః
ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II
ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం
6 వ స్వాతి కథ
ప్రహ్లాధునికి విష్ణువుపై భక్తి రోజురోజుకు పెరుగుతున్నది. అణుక్షణం నారాయణ మంత్ర జపము చేస్తున్నాడు. ఇంత భక్తిని చూచి ఇంద్రుడే ఆశ్చర్యపోయాడు. లోకాలన్ని జయించాడు హిరణ్యకశిపుడు. విష్ణువు ఏలోకములో కూడ కనిపించ లేదు. పిరికిపందలా పారిపోయాడని బావించాడు. తిరిగి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు.
హిరణ్యకశిపుని నలుగురు కుమారులలో ప్రహ్లాదుడు చక్కటి రూపుకలవాడు. స్పురద్రూపి. కాని తండ్రి నిరొధిని ఆరాదిస్తున్నాడు. ఆ విషయము తెలుసుకున్న హిరణ్యకశిపుడు ,ఎట్లైన సరే ప్రహ్లాదుని మనస్సు మరల్చాలనుకున్నాడు. దానికి తగ్గ విధ్య వేర్పంచాలని,శుక్రాచార్యలవారి కుమారులు చండమార్కులను పిలిపించాడు. తన కుమారునునికి విష్ణువుపై భక్తిని మరల్చేలా విధ్యాబుద్ధులు నేర్పించమని చెప్పి ప్రహ్లాదుని అప్పగించాడు.
గురువుల దగ్గర విద్యనభ్యస్తునే, హరినామ స్మరణచేసేవాడు. గురువులు భొదించిన ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో నేర్చుకునేవాదు. అయితే హరినామ జపాన్ని మాత్రము విడవలేదు. కొంత కాలము తర్వాత ప్రహ్లాదుని గురుకులమునుంచి పిలిపించాడు. నాయన నీవు ఏమి నేర్చుకున్నావో చెప్పమన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు,తండ్రీ చక్రహస్తుని గురించి నేర్పని చదువు చదువు కాదు అని విష్ణు మహిమల గురించి చెప్పసాగెను. హిరణ్యకశిపుడు గురువులపై కోపగించి,రాక్షసవిద్యలు నేర్పమని మరల ప్రహ్లాదునుని చండమార్కులకు అప్పగించి తీవ్రముగా హెచ్చరించిపంపుతాడు.గురువులు "ప్రహ్లాద! మేము ఏమి భోదించాము,నీవు నీ తండ్రిగారి దగ్గర చెప్పేదేమిటి" అని దండించారు. గురువులారా, అయస్కాంతము ఇనుమును లాగినట్లు నా మనస్సు హరిపైకి పోవుతున్నది" అని సమాదానము యిచ్చాడు.'హరియే నా సర్వస్వము. హరియే నా దైవము. అన్యులను ఆరాదించను. మీరు నేర్పించిన విధ్యలన్నిటిని నేర్చుకుంటాను. కాని హరిని చేరే ఆధ్యత్మిక విధ్యే నాకు కావాలీఅని ప్రహ్లాధుడు గురువులకు స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. చండమార్యులు ఏమి చేయాలో పాలుపోలేదు. ఏమైతే అది అయివుందని బావించి తమ విధ్యలన్నిటిని నేర్పుతారు.
అన్ని విధ్యలలో శ్రేష్ఠమైనది ఆధ్యాత్మిక విధ్య అని భగవధ్గీతలొ శ్రకృష్ణ భగవానుడు చెప్పాడు. నేను ఎవరూ అని తెలుకోవడమే ఆధ్యాత్మిక విధ్య. తెలుసుకోడంతోపాటు చూడగలగాలి. అపుడు ప్రతిదీ నేనే అని చూడగలవు.అపుడే ప్రతివారిలోను భగవముని ధర్శిగలరు. ఏ ఒక్కరు ఇతర వ్యక్తి కంటే తక్కువ కాదు,ఎక్కువకాదు.అందరూ సమనమే.ఆధ్యాత్మికతకు కులం,మతం,రంగు,రుచి,వాసన లేదు.ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో,అప్పుడే పరమాత్మకు దగ్గర కాగలము.
ఈ జగత్తులో ఒక వస్తువు వున్నదంటే,దాని సృష్టి కర్త తప్పని సరిగా ఉంటాడు. ఆయనే భగవంతుడు. సర్వ సృష్టికి ఆధారమైనవాడు, చరాచరా జగత్తును సృష్టి చేసినవాడు కూడా ఆయనే .ఆయనే శ్రీమహావిష్ణువు.
పంచభూతాల సమ్మెళనమే ఈ ప్రపంచము.ఈ అయిదు సమ తుల్యముగా వుంటేనే మనిషి మనుగడ సాపిగా సాగుతుంది. లేదంటే ఎన్నో కష్టాలకు గురికావలసివస్తుంది. పంచభూతాలను ఆరాధిస్తే ఆ పరమాత్మను ఆరాధించడంతో సమానమని మన పూర్వులు విశ్వసించారు.
ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని కళల్లో ఆరితేరినా మనిషి సంపూర్ణుడు కాలేడు. అరవై అయిదో కళగా అతడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి. అదే చింతనతో జీవితాన్ని సాగించాలి. ఆ విద్య ఉదర పోషణకు సంబంధించినది కాదు. అది విజ్ఞాన తృష్ణకు చెందినది. ఆ జ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించుకొని లౌకిక, పారలౌకిక ధర్మాల్ని పాటించడానికి ఆధ్యాత్మిక విద్య దోహదపడుతుంది. లోక కల్యాణం కోరేవారి ఆశయ సాధనకు ఆ విద్యే ప్రాణంపోస్తుంది. కంటికి కనిపించని దివ్యశక్తి ఆరాధన అది. సాకార, నిరాకార విధానాల్లో ఎలా చేసినా ఆ సాధన పరమార్థం నెరవేరినట్లే!