రవ్వలకొండ శ్రీశ్రీశ్రీ చెంచులక్ష్మీ సమేత పావన నరసింహస్వామి స్వాతి మనొభీష్ట పూజ విదానము
3 వ స్వాతి మనొభీష్ట పూజ
పూజ ప్రారంభము
ముందుగా వస్రము పరచి పటాలను ఉంఛండి. పటాలకు కుంకుమ లేదా చందనము బొట్లు పెట్టండి. పూలమాల వేసి,ధీపము వెలగించండి.అగరబత్తీలు కూడా వెలిగించండి.విడిపూలు అష్టోత్తరశతనామావళికి సిద్ధముగా ఉoచుకోండి.అరటి పండ్లు పెట్టండి. నైవేధ్యము సిద్ధముగా ఉoచుకోండి . ఇప్పుడు పూజ ప్రారంభించుకుందాము
ప్రార్థన
శుక్లాం భరదరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్న వదనం ద్యాయేత్ , సర్వ విగ్నోప శాంతయే .
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం ,
అనేక దంతం భక్తానాం, ఏకదంతం ఉపాస్మహే
(తెల్లని వస్త్రములతో అంతటా వ్యాపించిన వాడై, చంద్రుని వంటి ప్రకాశం కలవాడై,నాలుగు భుజములు(చేతులు) కలవాడై, ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని ధ్యానించుచున్నాము. నాయకత్వం లేని మాకు నాయకుడివై మమ్ములను నడిపించు.కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము)
శ్లో|| ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ - మన్యేన సిన్దు తనయా మవ లంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం - లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
(ఓ దేవా! చతుర్భుజుడవగు నీవు ఒక చేత శంఖమును, ఒకచేత చక్రమును, ఒక చేత లక్ష్మీ దేవిని ధరించి, ఒక కుడి చేతితో అభయమునిచ్చు హస్తముద్రను దాల్చి యుందువు. అట్టి మహానీయుడవగు నృసింహ దేవా! చేయూతనోసగి నన్ను కాపాడుము)
శ్లో|| సంసార యోగి సకలే ప్సిత నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలన్ద్రియ మృత్యునాశ -
సజ్కల్ప సిందు తనయాకు చ కు జ్క మాజ్క ! లక్ష్మీ నృసింహ ! మమ దేహి కరావలమ్బమ్ ||
( ఓ దేవా! లేనిపోని కోరికలకు సంసారమే కారణము. ఆ కోరికలు నేరవేరుటకై నిత్యమూ ఏవో చేయవలసి వచ్చుచున్నది. అందువలన నీవు సంకల్పించినచొ అవి అన్నియు నశించును. లక్ష్మీ దేవి యొక్క కుచ కుంకుమచే చిహ్నితమగు వక్ష స్స్థలముకల నృసింహదేవా! నా సంసార బాధలను పోగొట్టి నన్ను రక్షింపుము.)
సత్యజ్ఞాన శివస్వరూప మమలమ్ క్షీరాబ్ధి మధ్యస్థితం
యోగారూఢ మతిప్రసన్న వదనమ్ భూషా సహస్రోజ్వలమ్|
త్ర్యక్షం చక్ర పినాక సాభయ వరాన్విభ్రాణమర్కచ్ఛవిమ్
ఛత్రీభూత ఫణీన్ద్ర మిన్దు ధవళమ్ లక్ష్మీనృసింహం భజే||
సంకల్పం
(మీరు దేని విషయమై ఈ పూజచేయుటకు సంకల్పించుకున్నారొ -ఆ కోరికలు భక్తి,శ్రద్ధలతో స్వామికి విన్నవించుకోవాలి.మీ సంకల్పము నెరవేరేవరకు ప్రతి స్వాతికి యీ సంకల్పమే విన్నవించుకోవాలి.)
ధ్యానము
(స్వామివారిపై దృష్టిని కొద్దిక్షణాలు నిలిపి కళ్ళుమూసుకొని స్వామివారిని రెండు నిమిషాలు ధ్యానము చేయాలి. తర్వాత మెల్లగా కళ్ళు తెరచి స్వామిని దర్శించుకొని నమస్కరించాలి.)
శ్రీ నరసింహ స్వామి అష్టోత్తర శతనామావళి
(ప్రతి నామానికి ఒక పువ్వు స్వామివారి చెంతనుంచాలి
ఓం నారసింహాయ నమః
ఓం మహాసింహాయ నమః
ఓం దివ్య సింహాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం ఉగ్ర సింహాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం స్తంభజాయ నమః
ఓం ఉగ్రలోచనాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం సర్వాద్భుతాయ నమః || 10 ||
ఓం శ్రీమతే నమః
ఓం యోగానందాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హరయే నమః
ఓం కోలాహలాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం విజయాయ నమః
ఓం జయవర్ణనాయ నమః
ఓం పంచాననాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః || 20 ||
ఓం అఘోరాయ నమః
ఓం ఘోర విక్రమాయ నమః
ఓం జ్వలన్ముఖాయ నమః
ఓం మహా జ్వాలాయ నమః
ఓం జ్వాలామాలినే నమః
ఓం మహా ప్రభవే నమః
ఓం నిటలాక్షాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం దుర్నిరీక్షాయ నమః
ఓం ప్రతాపనాయ నమః || 30 ||
ఓం మహాదంష్ట్రాయుధాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం చండకోపినే నమః
ఓం సదాశివాయ నమః
ఓం హిరణ్యక శిపుధ్వంసినే నమః
ఓం దైత్యదానవ భంజనాయ నమః
ఓం గుణభద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః
ఓం బలభద్రకాయ నమః
ఓం సుభద్రకాయ నమః || 40 ||
ఓం కరాళాయ నమః
ఓం వికరాళాయ నమః
ఓం వికర్త్రే నమః
ఓం సర్వర్త్రకాయ నమః
ఓం శింశుమారాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం ఈశాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం విభవే నమః
ఓం భైరవాడంబరాయ నమః || 50 ||
ఓం దివ్యాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం కవయే నమః
ఓం మాధవాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం వరప్రదాయ నమః
ఓం అధ్భుతాయ నమః ll 60 ll
ఓం భవ్యాయ నమః
ఓం శ్రీవిష్ణవే నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అనఘాస్త్రాయ నమః
ఓం నఖాస్త్రాయ నమః
ఓం సూర్య జ్యోతిషే నమః
ఓం సురేశ్వరాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమః II70II
ఓం వజ్రదంష్ట్రయ నమః
ఓం వజ్రనఖాయ నమః
ఓం మహానందాయ నమః
ఓం పరంతపాయ నమః
ఓం సర్వమంత్రైక రూపాయ నమః
ఓం సర్వమంత్ర విధారణాయ నమ:
ఓం సర్వతంత్రాత్మకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సువ్యక్తాయ నమః
ఓం భక్ర వత్సలాయ నమ: II80II
ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః
ఓం శరణాగత వత్సలాయ నమః
ఓం ఉదార కీర్తయే నమః
ఓం పుణ్యాత్మనే నమః
ఓం మహాత్మనే నమ:
ఓం దండ విక్రమాయ నమః
ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః
ఓం భగవతే నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||
ఓం శ్రీనివాసాయ నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జగత్పాలాయ నమః
ఓం జగన్నాధాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం ద్విరూపభ్రుతే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరజ్యోతిషే నమః
ఓం నిర్గుణాయ నమః || 100 ||
ఓం నృకేసరిణే నమః
ఓం పరతత్త్వాయ నమః
ఓం పరంధామ్నే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం లక్ష్మీనృసింహాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం ధీరాయ నమః
ఓం ప్రహ్లాద పాలకాయ నమఃII108II
ఓం లక్ష్మీనరసింహ అష్టొత్తర శతనామావళి సంపూర్ణం
3 వ స్వాతి కథ
జయ విజయులు శాపం వలన కశ్యపుడు,ధితి లకు హిరణ్యాక్షుడు,హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. ఘోర తపస్సు చేసి బ్రహ్మతో ఎన్నోవరాలు పొందుతారు. వర మధ,బల పరాక్రమాల గర్వముతో పెట్రేగి పొతారు.దేవతలు వీరిని చూచి గద్ధను చూచిన పాముల్లా పారిపోయేవారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి పాతాళములో పడదోయబోతే శ్రీ మహావిష్ణువు వరాహవతారము దాల్చి,భూమిని తన కోరలతో పట్టి జలముపై నిలిపాడు.భూమిని ఎందుకు జలములో పడవేయాలనుకున్నాడు? శ్రీ మహావిష్ణువు హీరణ్యాక్షునికి వైరి. నారదుని వలన విష్ణువు యజ్ఞవరాహ రూపములో పాతాలములో దాగివున్నాడని తెలిసి భూమిని అలాచేయబోయాడు. హిరాణ్యాక్షుడు గధా యుధ్దప్రవీణుడు. శ్రీ మహావిష్ణువే యీ రూపములో వచ్చాడని గ్రహించి,వరాహమూర్తిని అంతము చేయాలని తన గధాయుధముతో దాడికి దిగుతాడు. వారిరువురి మధ్య భీకరపోరు జరుగుతుంది. చివరికి శ్రీవరాహుడు తన కోరలతొ చీల్చి చంపుతాడు.ఇంతటితో హిరణ్యాక్షుని కథ ముగుస్తింది. విష్ణువు తన సేవకునికి యిచ్చిన మాట వరాహవతారుడై తీర్చినాడు.
ఈ విషయము తెలిసిన హిరణ్యకశిపుడు చాలా విచారిస్తాడు. తన సోదరుని మరణానికి కారణమైన విష్ణువుపై ప్రతీకారము తీర్చుకోవలనుకుంటాడు. మరణంలేని వరం పొందటానికి బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి వెళతాడు.
అహంకారంతో,బల,వర గర్వముతొ హిరణ్యాక్షుడు రెచ్చిపోయాడు.చివరికి ఏమైంది-అంతము కాక తప్పలేదు. మన దగ్గర శక్తి వున్నంతవరకు చక్రము తిప్పగలము. తర్వాత అయిన భగవంతునికి శరణాగతి కావలసిందే. లేకుంటే పతనము తప్పదు.
భగవంతుడు తనమాయచే జగత్తును కప్పి వుంచాడు. అది మాయ అని తెలిసే అవకాశం మానవమాత్రుడికి వుండదు. ఉదాహరణకు కాంతా కనకాల మాయ. ఆ పొరను తప్పించుకోవడం సాధ్యం కాదు. అందువలన ఆయన దర్శనము సాధ్యం కాదు. ఒక కొలనులో ఒక వ్యక్తి, దిగి, నీరు త్రాగుదామని చూడగా, అందులో పాచితో కూడిన నీరు దర్శనం యిచ్చింది. వెంటనే అతడు, తన చేత్తో పాచిని త్రోసివేసి, నీళ్లు త్రాగుతున్నాడు. ఆ పాచిక్రింద నీళ్ళు, స్పటికంలా స్వచ్ఛంగా వున్నాయి. అలాగే, ఆ సచ్చిదానంద స్వరూపమే, మాయ అనే పాచితో కప్పబడి వున్నట్లు, నాకు కనబడింది. పాచిని తొలగించగలిగితే, స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. '
పరమాత్మునిపై నమ్మకం ఉన్నవారికి అతనితో సంబంధం స్వతహాగా ఏర్పడి ఉంటుంది. నమ్మకము అంటే నా ఉద్దేశ్యము – ”జీవితంలో ఏదైతే జరిగిందో అంతా మంచే జరిగింది, జరగబోయేది కూడా మరింత మంచిగా ఉంటుంది” అన్న నమ్మకము. ఈ నమ్మకము పెరగాలంటే నీలోని అహంకారాన్ని తొలగించి బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకో. ఇతరుల ప్రభావంలోకి నీవు రాకు.
భగవంతుని సంతానముగా భావించి అతను చెప్పేది విను, నిర్లక్ష్యంగా వినద్దు. శ్రద్దతో, ప్రేమ, సమర్పణ భావంతో విను. తర్వాత, నీతో నీవు ఆలోచించు కునేటప్పుడు లేక మాట్లాడుకునేటప్పుడు భగవంతుడు ఏమి చెప్పాడు అని ఆలోచించుకో.
పరమాత్మతో నీ సంబంధం ఎంత గాఢంగా ఉంటుందో అంత శక్తిని పొందుతావు. భయము నాశనమవుతుంది. నీ జీవితంలో ప్రతీదీ సహజంగా కనిసిస్తుంది. నువ్వు స్వచ్ఛంగా, తెలివైనవాడిగా, మంచిగా తయారవుతావు.
అంతకరణ శుద్ది చేసుకుని శ్రీ నరసింహస్వామిని నిండు మనసుతో సేవించండి .దానితో శాశ్వతమైన పరమాత్మ పాప్తి కలుగుతుంది .మనసులోగల అసాధారణ కోరికలు తీరతాయి .చివరకి మీరు పూర్తిగా నిష్కాములవుతారు .
శ్రీ నరసింహస్వామి కథలు చిత్తశుద్ది కలిగిస్తాయి .పరమార్థ ప్రాప్తిని పొందవచ్చు .